గుంటూరు జీజీహెచ్లో కరోనా సేవలను తిరిగి మిలీనియం బ్లాక్లో పునరుద్ధరించారు. కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఏసీ కళాశాలలో తాత్కాలికంగా సేవలను అందించారు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు, ఓపీ సేవలను మిలీనియం బ్లాకుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రద్దీ లేకుండా ప్రజలకు సేవలను అందిస్తామన్నారు.
జీజీహెచ్ మిలీనియం బ్లాక్లో కొవిడ్ సేవలు - గుంటూరు జీజీహెచ్లో కొవిడ్ సేవలు
గుంటూరు జీజీహెచ్లో కొవిడ్ సేవలను మిలీనియం బ్లాక్లో పునరుద్ధరించారు. నేటి నుంచి నిర్ధారణ పరీక్షలు, ఇతర సేవలను ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

జీజీహెచ్లో కొవిడ్ సేవలు