ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 6:43 PM IST

ETV Bharat / state

నరసరావుపేటలో 180కి చేరిన కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా నమోదైన 2 కేసులతో కలిపి మెుత్తం పట్టణంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 180కు చేరుకుంది.

corona cases increases in narasaraopeta
నరసరావుపేటలో పెరుగుతున్న కరోనా బాధితులు

నరసరావుపేటలో నేడు కొత్తగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 4 కేసులు జిల్లాలో నమోదు కాగా వాటిలో 2 కేసులు నరసరావుపేటకు చెందినవే కావటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజగా నమోదయిన పాజిటివ్ కేసులతో నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరుకుంది. 2 కేసుల్లో ఒకటి వరవకట్టలో నమోదు కాగా, మరొకటి శ్రీనివాసనగర్​లో నమోదయ్యినట్లు అధికారులు వెల్లడించారు.

మిషన్ మే 15 కార్యక్రమంలో ఈనెల 15 నాటికి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులను జీరోస్థాయికి తెస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి రోజు పట్టణంలో ప్రతిరోజు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి:పట్టాలు తప్పిన శ్రామిక్​ రైలు.. అందరూ సేఫ్​​

ABOUT THE AUTHOR

...view details