'మా ఇంటికి ఎవరూ రావద్దు' - Corona Mask boarded at Guntur district
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు స్వీయ సంరక్షణ చర్యలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో కొవిడ్ వ్యాప్తికి దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ కుటుంబం మరో అడుగు ముందుకేసి మా ఇంటికి ఎవరూ రావద్దు అని బోర్డు పెట్టారు.

ఇంటి గేటు వద్ద మాస్క్ ధరించాలని పెట్టిన బోర్డు
కరోనా వైరస్ వ్యాప్తికి స్వీయ రక్షణకు మించిన వైద్యం లేదని గుర్తించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. ఇంటి ముందు 'మా ఇంటికి ఎవరూ రావద్దు' అంటూ బోర్డు పెట్టారు. అత్యవసరమైతే మాస్కు ధరించి లోపలికి రావాలని బోర్డులో రాశారు. స్థానికులను ఈ బోర్డు ఆలోచింపజేస్తోంది.