ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2020, 12:01 PM IST

ETV Bharat / state

కమ్మేస్తున్న మహమ్మారి... నిబంధనలు కఠినతరం

గుంటూరు జిల్లాలో అధికారులు లాక్​డౌన్​ నిబంధనలు కఠినతరం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా.. రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటున్నారు.

corona in guntur district
గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు లాక్​డౌన్​ నిబంధనలు కఠినతరం చేశారు. ఒక మండలం నుంచి వేరే మండలానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. గుంటూరు నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు.. ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకూ 129 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇంకా 1,700 మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details