ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేడికొండూరులో కరోనాతో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినా.. వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా జిల్లాలో 323 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా మేడికొండూరులో వ్యక్తి మృతి చెందాడు.

By

Published : Nov 4, 2020, 11:42 PM IST

corona death
corona death

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పర్వం కొనసాగుతూనే ఉంది. మేడికొండూరులో కరోనాతో వ్యక్తి మృతి చెందాడు. నెల రోజుల క్రితం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కాటూరి కళాశాల క్వారంటైన్ వార్డులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో కరోనాతో 627 మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details