ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2021, 8:30 PM IST

ETV Bharat / state

కుటుంబమంతా ఆస్పత్రిలో..వృద్ధురాలికి స్వచ్ఛంద సంస్థ అంత్యక్రియలు

అందరూ ఉన్నా ఆమె అనాథ అయ్యింది. కరోనాతో వృద్ధురాలు మృతి చెందింది.. అంతేకాకుండా ఆ కుటుంబంలోని అందరూ కొవిడ్​తో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించి.. ఇంకా మానవత్వం ఉందని చాటుకున్నారు.

corona funerals in tenali
తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించిన స్వచ్ఛందసేవా సంస్థ

కుటుంబమంతా ఆస్పత్రిలోనే.. చివరి తంతు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ

గుంటూరు జిల్లా తెనాలిలో టౌన్ చర్చి ఎదురుగా ఉన్న ఒకే కుటుంబంలో సభ్యులందరికీ కరోనా సోకింది. అదే కుటుంబంలోని వృద్ధురాలు మినహా మిగిలిన వారందరూ గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తెనాలిలో ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న వృద్ధురాలు కొవిడ్​తో మరణించింది. కుటుంబ సభ్యులకు విషయం తెలిసినా.. చివరి చూపు చూసే అవకాశం వారికి దక్కలేదు. వెంటనే సమాచారాన్ని అందుకున్న 'సత్యం-శివం-సుందరం' అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ముందుకొచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

"కరోనా మహమ్మారి ఎంతోమందిని బలి తీసుకుంది. కరోనా భయంతో రోడ్లవెంట చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోలీసుల అనుమతితో చాలా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశాం. కరోనాతో చనిపోయిన వ్యక్తులను కడచూపునకు కుటుంబ సభ్యులు రాని సందర్భాల్లో చివరి తంతు మేమే పూర్తి చేస్తున్నాం" - స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు.

ఇదీ చదవండి:భర్త నడిపిన ఆటోనే జీవనాధారం.. ఆ మహిళ ఎందరికో స్పూర్తిదాయకం

ABOUT THE AUTHOR

...view details