ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 4:01 PM IST

ETV Bharat / state

పిడుగురాళ్లలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మగుడి పరిధిలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరింది. శనివారం కొత్తగా ఆరుగురు వైరస్ బారిన పడినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

పిడుగురాళ్లలో మరో 6 కరోనా కేసులు !
పిడుగురాళ్లలో మరో 6 కరోనా కేసులు !

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మగుడి పరిధిలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. గత పదిరోజులుగా ఈ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించి 97 మందికి పరీక్షలు నిర్వహించగా... ఆరుగురు వైరస్ బారిన పడ్డారని ప్రభుత్వ వైద్యాధికారి శ్యామల తెలిపారు. గతంలో 7 కేసులతో కలుపుకొని మెుత్తం కేసుల సంఖ్య 13కు చేరుకుందని వెల్లడించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పట్టణంలో కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి... అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details