ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు - గుంటూరులో కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో రోజూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నేడు కొత్తగా 6 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 442కు చేరింది.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

By

Published : May 25, 2020, 4:45 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా హాట్ స్పాట్​గా మారిన నరసరావుపేటలో 3, గుంటూరు, జొన్నలగడ్డ, చిలకలూరిపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయ.

నగరంలోని ఎస్వీఎన్ కాలనీలో కేసు నమోదైంది. తాజా కేసులతో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 442కు చేరింది. ప్రస్తుతం గుంటూరులో 182 కేసులు, నరసరావుపేటలో 190 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details