ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. జిల్లాలో ఒక్క రోజే 23 కేసులు

గుంటూరు జిల్లాలో కొంత మేర కరోనా కేసులు తగ్గాయనుకుంటున్న సమయంలో.. మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. ఈ రోజు గుంటూరు నగరంలోనే ఏకంగా 23 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య.. 529కు చేరింది.

By

Published : Jun 2, 2020, 4:05 PM IST

corona cases at guntur
గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఇవాళ గుంటూరు నగరంలోనే 23 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో వైరస్ బాధితుల సంఖ్య 529కు చేరింది.

ప్రాంతాల వారీగా చూస్తే శ్రీనివాసరావు తోటలో 5, ఎల్. బి. నగర్లో 5, సంజీవయ్య నగర్ 4, ఆర్టీసీ కాలనీ 3, సంగడిగుంట 2, ఏటి అగ్రహారం1, నగరం పాలెం1, పొత్తూరివారి తోట 1, కొత్తపేటలో 1 కేసు నమోదయ్యాయి.

ఈ 23 మందిలో.. నగరంలోని బైపాస్ రోడ్డులో తాత్కాలికంగా నిర్వహిస్తున్న కొల్లి శారద మార్కెట్ లోనే 18 మంది ఉండడంపై.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి కేసు గుర్తించిన వెంటనే.. మార్కెట్ ను మూసి వేశారు. పూర్తిగా శుద్ధి చేయడమే కాక.. అక్కడ వ్యాపారాలు చేసే 265 మందికి పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details