గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని పోలింగ్ కేంద్రం వద్ద కొందరు హడావుడి చేశారు. గుంపులుగా వచ్చి పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అధికారులు, పోలీసులపైన పెద్దగా కేకలు వేస్తూ గందరగోళం చేశారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలనే అడ్డుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారని ఎస్సై తెలిపారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగిందని చెప్పారు. తమను విధులు నిర్వర్తించకుండా వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని పోలీసులు ఆరోపించారు.
అంగలకుదురులోని పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం - confusion at the polling station news
గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు వ్యక్తులు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఆందోళన సృష్టించారు.
![అంగలకుదురులోని పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం confusion at the polling station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10555001-735-10555001-1612854502657.jpg)
పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం