ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 1:02 PM IST

ETV Bharat / state

వైకాపాలో వర్గ పోరు..అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య తోపులాట

వైకాపాలో రోజురోజుకు వర్గ పోరు ముదురుతోంది. గుంటూరు జిల్లా కోవెలమూడిలో వైకాపా వర్గ పోరు పతాకస్థాయికి చేరింది. ద్విచక్ర వాహనానికి ట్రాక్టర్​ తగలడం వల్ల ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.

conflict between ysrcp group
వైకాపాలో వర్గ పోరు.

గుంటూరు జిల్లా వట్టిచెరకూరు మండలం కోవెలమూడిలో వైకాపాకు చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తి ట్రాక్టర్​తో పొలం దున్ని వస్తుండగా.. అదే సమయంలో రహదారిపై ఉన్న ద్విచక్రవాహనానికి ట్రాక్టర్​కు ఉన్న గొర్రు తగిలింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన గొడవ.. అర్ధరాత్రి వట్టిచెరకూరు పోలీస్ స్టేషన్​కు చేరింది.

పోలీస్ స్టేషన్​లోనూ ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఒకరినొకరు నెట్టుకుని పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి చేబ్రోలు స్టేషన్​కు పంపించారు.

ఇదీ చదవండి: సంక్షోభంలో విద్యారంగం.. ప్రక్షాళన చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details