తమ పేరుతో మరొకరు గృణ నిర్మాణ రుణాలు తీసుకున్నారని.. సంక్షేమ పథకానికి దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరిస్తున్నారని.. గుంటూరు సుద్ధపల్లి డొంకకు చెందిన కొందరు బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తామంటూ తమ వద్ధ ఆధార్, రేషన్ కార్డు వంటి ధ్రువపత్రాలు తీసుకున్నారని... వాటితోనే బినామీ రుణాలు పొందుతున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమ పేరుపై రుణం ఉండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు నిర్వహించి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
తన పేరిట గృహ నిర్మాణాల రుణం తీసుకున్నారనీ... బాధ్యులను శిక్షించాలంటూ ఓ మహిళ గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా సుద్దపల్లి డొంకకు చెందిన నాగమణి.. ఓ కిరాణా షాపులో పని చేస్తోంది. ఆ షాపు యజమానురాలు సుశీలమ్మ ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు ఇప్పిస్తామంటూ.. తన వద్ద ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నట్టు ఆరోపించింది. వాటితో తన పేరిట గృహ నిర్మాణ రుణాలు తీసుకున్నారని ఆవేదన చెందింది.
మూడేళ్ల క్రితం తీసుకుంటే... ఇప్పుడు వెలుగులోకి..!
మూడేళ్ల క్రితమే నాగమణి ధ్రువపత్రాలతో... సుశీలమ్మ గృహ నిర్మాణ రుణాలు తీసుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న నాగమణి... జగనన్న ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఆమె ధ్రువపత్రాన్ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారని అధికారులను ప్రశ్నించటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
నిలదీస్తే... దాడికి దిగారు