ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాల'ను ​ప్రారంభించిన సీఎం జగన్

By

Published : May 19, 2022, 11:56 AM IST

Updated : May 19, 2022, 2:27 PM IST

Animal Health Service Chariots: 'వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాల'ను ముఖ్యమంత్రి జగన్​ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

Animal Health Service Chariots
'వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాల'ను ​ ప్రారంభించిన సీఎం జగన్

Animal Health Service Chariots: పశువులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో 143 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 175 వాహనాలను ప్రారంభించగా, రెండో దశలో 135 కోట్ల వ్యయంతో మిగిలిన 165 పశువుల అంబులెన్స్‌లు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు ప్రవేశపెట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి ఒక వాహనాన్ని కేటాయించారు.

వైఎస్సార్‌ సంచార పశువుల అంబులెన్స్​లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేశారు. మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962 కు ఫోన్‌ చేసి రైతు పేరు, గ్రామం, మండలం, పశువు అనారోగ్య సమస్య వివరించిన వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సమాచారం చేరుతుంది. ఆ వెంటనే పశువుల అంబులెన్స్‌లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్లి వైద్యసేవలు అందిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు, తదితర నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2022, 2:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details