మొక్కలు నాటిన ముఖ్యమంత్రి
వనమహోత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం - vana mahosthavam
రాష్ట్రంలో ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో 25 కోట్ల మొక్కలు నాటాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 70వ వనమహోత్సవాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లాలోని డోకిపర్రు గ్రామం వద్ద మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు.

జగన్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వనమహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. చిన్నారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు.