అమరావతికి మద్దతుగా దీక్ష చేస్తున్న రైతులకు చిన్నారులు సంఘీభావం తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో కూర్చొని చదువుకున్నారు. ఇంట్లో పెద్దలు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఒంటరిగా ఉండాలంటే భయమేస్తోందని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అమరావతికి మద్దతునిస్తూ చదువుకుంటున్నామని చెబుతున్నారు. 'సీఎం అంకుల్... మా బాధ చూసైనా మనసు మార్చుకోండి' అని దీనంగా వేడుకుంటున్నారు.
'సీఎం అంకుల్... మమ్మల్ని చూసైనా మనసు మార్చుకోండి ప్లీజ్' - అమరావతి కోసం తూళ్లూరులో చిన్నారుల దీక్ష
అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటానికి చిన్నారులు తోడయ్యారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులకు మద్దతుగా పాల్గొంటున్నారు. ఆదివారం పిల్లలంతా దీక్షా శిబిరంలోనే కూర్చొని చదువుకున్నారు.

అమరావతి పోరుకు చిన్నారుల మద్దతు
రైతులు చేస్తున్న పోరాటానికి చిన్నారులు తోడయ్యారు