ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమ నూతన భవన నిర్మాణానికి దాతల సాయం - Donor assistance to Sri Mahatma Seva Shanti Ashram in Tenali

గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమ నూతన భవన నిర్మాణానికి చాగంరెడ్డి కుటుంబీకులు.. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మూడు లక్షల రూపాయల విరాళం అందజేశారు.

Sri Mahatma Seva Shanti Ashram
శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమం

By

Published : May 24, 2021, 10:40 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డు సమీపంలోగల 'శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమం' శాశ్వత భవన నిర్మాణం కోసం దాతలు ఆర్థిక సాయం చేశారు. చాగంరెడ్డి కొండారెడ్డి, సరోజిని జ్ఞాపకార్థం వారి కుమారులు మూడు లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు.

చాగంరెడ్డి సుందరరామిరెడ్డి, బాలకృష్ణరెడ్డి, రఘువీరారెడ్డిలు ఈ సొమ్మును ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదగా వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. తన వంతు ఆశ్రమానికి సాయాన్ని చేస్తానని తమ వంతు ఆశ్రమానికి సాయం ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details