ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలు.. సొంతూళ్లకు బయల్దేరారు - migrate labours at tenali news

లాక్ డౌన్ కారణంగా పనులు లేక తినడానికి తిండి దొరక్క గుంటూరు జిల్లా తెనాలిలో ఇబ్బందిపడుతున్న రాజస్థాన్ కార్మికులను స్వస్థలాలకు తరలించారు. ముందుగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడకు.. అక్కడి నుంచి ట్రైన్​లో రాజస్థాన్​కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.

central-government-sramic-train-started-from-tenali
తెనాలి నుంచి రాజస్థాన్​కు వలస కూలీలు తరలింపు

By

Published : May 13, 2020, 7:44 PM IST

వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక రైలు విజయవాడ నుంచి రాజస్థాన్​కి బయలుదేరింది. రాత్రి తెనాలి రెవెన్యూ డివిజన్​లో ఉన్న రేపల్లె, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో ఉన్న 200 మంది వలస కార్మికులను విజయవాడ తరలించారు.

ముందుగా అందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి, వారికి సర్టిఫికెట్లు, భోజన వసతులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ట్రైన్​లో వారు రాజస్థాన్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details