ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పర్యటన కాదు... ముందు మా సమస్యలు పరిష్కరించండి'

By

Published : Nov 25, 2019, 3:42 PM IST

చంద్రబాబు రాజధాని పర్యటనపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పర్యటన కంటే ముందు రాజధాని రైతులకు గతంలో ఇచ్చిన హామీలపై సమాధానం ఇవ్వాలని కోరారు.

అమరావతి రైతుల ఆందోళన

ఈనెల 28న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజధాని ప్రాంత పర్యటనపై కొందరు స్థానిక రైతులు నిరసన వ్యక్తంచేశారు. తన పర్యటన కంటే ముందు రాజధాని రైతులకు గతంలో ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామని ధ్వజమెత్తారు. రహదారులు, మౌలిక సదుపాయలు పూర్తిచేసి ప్లాట్లు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికీ ఆ పని పూర్తిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details