ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో! - పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో!

తమపై పోలీసుల లాఠీఛార్జ్​ను నిరసిస్తూ ...తుళ్లూరులో రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎండలోనే రహదారిపై రైతులు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మహిళలు ధర్నా శిబిరం ముందు రహదారిపై బైఠాయించి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళలు పోలీసులు కొట్టిన దెబ్బలను చూపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడం దారుణమని రైతులు మండిపడ్డారు.

capital-farmers-rastaroko
తుళ్లూరులో రైతులు రాస్తారోకో

By

Published : Jan 21, 2020, 9:24 AM IST

.

తుళ్లూరులో రైతులు రాస్తారోకో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details