ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిలే నిరాహార దీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలతో హోరెత్తిన రాజధాని గ్రామాలు

అమరావతి కోసం రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రాజధానుల ప్రకటనకు నిరసనగా మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఆందోళనలో పాల్గొంటున్నారు.

By

Published : Mar 12, 2020, 7:53 AM IST

amaravathi farmers agitation
కొనసాగుతున్న అమరావతి రైతులు ఆందోళన

కొనసాగుతున్న అమరావతి రైతులు ఆందోళన

రాజధాని గ్రామాల్లో 85వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అమరావతి రాజధానిగా కొనసాగించాలని.. మూడు రాజధానులు వద్దంటూ.. రాజధాని రైతులు, మహిళలు గళమెత్తారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, కృష్ణాయపాలెంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మందడంలో అమరావతి పరిరక్షణార్ధం మణిద్వీప వర్ణన పూజా కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్​పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. తుళ్లూరులో రైతులు రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని రైతులు చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details