ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభ్యర్థుల తరఫున కుటుంబసభ్యుల ప్రచారం

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు.

By

Published : Apr 4, 2019, 4:34 PM IST

అభ్యర్థుల తరఫున కుటుంబసబ్యలు ప్రచారం

అభ్యర్థుల తరఫున కుటుంబసబ్యలు ప్రచారం
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రోడ్ షో చేశారు. ఆయన సోదరి కమల.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తన సోదరుడు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. కరపత్రాలు పంచారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారనీ.. తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపిదేవి రమణారావు తరఫున ఆయన సతీమణి అరుణ ప్రచారం చేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details