ఏం జరిగింది ?
గుంటూరు గ్రామీణ ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం వంశీకృష్ణ అనే వ్యక్తి పొన్నూరు పరిధిలోని కొండముది అనే గ్రామంలో కేబుల్ వైర్లు కత్తిరిస్తుండగా మరో సంస్థ ప్రతినిధులు అతణ్ని పట్టుకుని.. పోలీసు స్టేషన్లో అప్పగించారు. స్టేషన్లో ఉన్న వంశీకృష్ణకు ఛాతీ నొప్పి రావడం వలన ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణ మాట్లాడుతూ... అమర్తలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో వైర్లు పరిశీలిస్తుండగా ఎనిమిది మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తనపై దాడిచేశారని ఆరోపించారు. తనపై యాసిన్ అనే వ్యక్తి, అతని సంబంధికులు దాడి చేశారంటూ.. బాధితుడు వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కిడ్నాప్ చేసి.. రోజంతా చిత్ర హింసలు పెట్టారని వంశీ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు రక్షణ కల్పించాలని వంశీ వేడుకున్నారు.