ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో వలస కూలీలకు మజ్జిగ పంపిణీ - గుంటూరులో వలస కార్మికులకు మజ్జిగ పంచిన తెదేపా

నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు తెదేపా ఆధ్వర్యంలో టోపీలు, మజ్జిగ పంపిణీ చేశారు. గుంటూరు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ అండగా నిలిచారు.

buttermilk distribute to migrant labours by tdp in guntur
తెదేపా ఆధ్వర్యంలో వలస కూలీలకు మజ్జిగ పంపిణీ

By

Published : May 27, 2020, 2:50 PM IST

గుంటూరు జాతీయ రహదారి మీదుగా స్వస్థలాలకు నడుస్తూ వెళుతున్న వలస కార్మికులకు.. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో భాగంగా మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో టోపీలు, మజ్జిగ అందజేశారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం, కాజా టోల్ గేట్ వద్ద ఉన్న పునరావాస కేంద్రాల్లోని వలస కూలీలకూ అందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details