బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్ బస్సు 16వ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద బోల్తా పడింది. ముందు వెళ్తున్న పోగాకు లోడు ట్రాక్టర్ను అధిగమించే క్రమంలో బస్సు డివైడర్ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఏడుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా, మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యడ్లపాడు ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యడ్లపాడులో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు - యడ్లపాడులో బస్సు ప్రమాదం వార్తలు
గుంటూరు జిల్లా యడ్లపాడులో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పొగాకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి.. బస్సు అదుపుతప్పింది. గాయపడిన వారిని.. చిలకలూరిపేట, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు.
![యడ్లపాడులో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు bus accident in yedlapadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6181236-820-6181236-1582511923222.jpg)
bus accident in yedlapadu
యడ్లపాడులో బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
Last Updated : Feb 24, 2020, 11:09 AM IST