ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినుకొండలో సంగం పాల దుకాణంపై బిల్డింగ్​ యజమాని దాడి

వినుకొండలోని సంగం పాల దుకాణంపై బిల్డింగ్​ యాజమాని దాడి చేశాడు. షాపులో ఉన్న పాలు, పెరుగు ప్యాకెట్లు, ఫ్రిజ్​లను ధ్వంసం చేశాడు.

By

Published : Aug 11, 2021, 4:53 PM IST

sangam-milk-shop
వినుకొండలో సంగం పాల దుకాణంపై బిల్డింగ్​ యజమాని దాడి

గుంటూరు జిల్లా వినుకొండలోని సంగం పాల దుకాణంపై బిల్డింగ్​ యాజమాని పుచ్చకాయ రామయ్య దాడి చేశాడు. షాపులో ఉన్న పాలు, పెరుగు ప్యాకెట్లు, ఫ్రిజ్​లను ధ్వంసం చేశాడు.

దుకాణదారుడు పెంటపాటి వెంకటరత్నానికి షాపు ఖాళీ చేయాలని ఇటీవల యజమాని తెలిపాడు. అయితే అద్దె అగ్రిమెంట్ సమయం పూర్తి కాకుండా ఎలా ఖాళీ చేస్తామని వెంకటరత్నం, ఆయన భార్య మీనాక్షి అన్నారు. దాంతో రామయ్య దౌర్జన్యం చేయగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం భవన యజమానికి నోటీసులు ఇచ్చిందని వెంకటరత్నం తెలిపారు.

ఈ క్రమంలో బిల్డింగ్​ యజమాని షాపుపై దాడి చేశాడని వెంకటరత్నం దంపతులు తెలిపారు.

ఇదీ చదవండి:lady mystery death: యువతి అనుమానాస్పద మృతి..

ABOUT THE AUTHOR

...view details