ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిలో మునిగి బాలుడు మృతి - boy dead to felldown in canal news update

సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు మృత్యువాత పడిన ఘటన.. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ళలో జరిగింది. పండగపూట కుమారుడు మృత్యువాత పడటం.. ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి బాలుడు మృతి
ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి బాలుడు మృతి

By

Published : May 15, 2021, 6:31 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఉన్న ఆక్స్ ఫర్డ్ స్కూల్ సమీపంలోని నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. పీడబ్ల్యూ కాలనీకి చెందిన మస్తాన్ కుమారుడు యాసిన్ (12) రంజాన్​ సందర్భంగా.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో కూరుకుపోయిన యాసిన్.. ఎంతకు బయటకు రాకపోవటంతో.. స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ప్రభాకర్ రావు సుమారు 3 గంటల సేపు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహం లభ్యం కావటంతో.. పండగపూట కుమారుడు మృత్యువాత పడటం.. ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details