ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈత సరదా ఆ బాలుడి ప్రాణం తీసింది - పెదనందిపాడు కాలువ పడి బాలుడు మృతి

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద పెదనందిపాడు బ్రాంచ్ కాలువలో శనివారం సాయంత్రం ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.

ఈత సరదా చిన్నారి ప్రాణం తీసింది
ఈత సరదా చిన్నారి ప్రాణం తీసింది

By

Published : Aug 30, 2020, 4:35 AM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద శనివారం రాత్రి నిషాద ఘటన జరిగింది. కృష్ణాజిల్లా ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఇండ్లమూరి స్వరూప్(14) మేనమామ గ్రామం నాదెండ్ల మండలం సాతులూరు వచ్చాడు. మేనమామ కొడుకు విజయ్​తో కలసి సమీపంలోని పెదనందిపాడు బ్రాంచ్ కాలువలో ఈతకు వెళ్లారు. ఇద్దరు చిన్నారులు ప్రవాహ వేగానికి తట్టుకోలేక కొట్టుకుపోయారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విజయ్​ను రక్షించారు. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో స్వరూప్ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి మృతదేహం లభ్యమైంది.

ఇదీ చదవండి :ఎవరైనా సరే... కఠినంగానే వ్యవహరిస్తాం: సీపీ

ABOUT THE AUTHOR

...view details