ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో బ్లాక్ ఫంగస్... అవాస్తవమన్న వైద్యాధికారులు - black fungus disease registered in guntur district

గుంటూరు జిల్లా తెనాలిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిందని వస్తున్న వార్తలు అవాస్తవమని డిప్యూటీ డీఎంహెచ్​ఓ నరసింహ నాయక్ తెలిపారు. పట్టణానికి చెందిన ఓ మహిళ కంటి సమస్యతో బాధపడుతోందని, ఆమెకు వచ్చిన వైద్య నివేదికలో బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అవలేదని తెలిపారు.

black fungus disease registered in tenali
తెనాలిలో బ్లాక్ ఫంగస్

By

Published : May 17, 2021, 10:52 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్​కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. చికిత్స తీసుకున్న అనంతరం ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ఇంటికి వచ్చినప్పటి నుంచి తల, కనుగుడ్లు నొప్పి రావటంతో... స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో మహిళకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిందని వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవమని డిప్యూటీ డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ అన్నారు. ఆమెకు కంటి సమస్యలు ఉన్నాయని, వైద్యులు ఇచ్చిన నివేదికలోనూ బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు నమోదవలేదని తెలిపారు.

ఇదీచదవండి.

దారుణం : ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి

ABOUT THE AUTHOR

...view details