ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 5:03 PM IST

ETV Bharat / state

విద్యుత్ బిల్లులు తగ్గించాలని భాజపా నిరసన

రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపుపై భాజపా నిరసన వ్యక్తం చేసింది. లాక్​డౌన్ లో ఉపాధి కోల్పోయి ఓవైపు ప్రజలు బాధపడుతుంటే.. విద్యుత్ బిల్లులు రెట్టింపు చేయడం సరికాదని నేతలు మండిపడ్డారు.

bjp protest
bjp protest

లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు రావడంపై భాజపా నేతలు మండిపడ్డారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో భాజపా నేత రంగిశెట్టి రామకృష్ణ నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details