గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరతపై భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించారు. నర్సుల ఆందోళనపై మీడియాలో వచ్చిన కథనాలను చూసిన భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆదేశాలతో స్థానిక నేత పాటిబండ్ల రామకృష్ణ... ఆసుపత్రి సిబ్బందికి 300 పీపీఈ కిట్లు అందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని విమర్శించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
నర్సుల ఆందోళనకు స్పందన... పీపీఈ కిట్లు అందజేత - తెనాలి నర్సులకు పీపీఈ కిట్లు పంపిణీ
పీపీఈ కిట్లు లేవంటూ... గుంటూరు జిల్లా తెనాలిలో నర్సులు చేసిన ఆందోళనలపై భాజపా నేతలు స్పందించారు. ఆసుపత్రి సిబ్బందికి 300 పీపీఈ కిట్లు అందించారు.
![నర్సుల ఆందోళనకు స్పందన... పీపీఈ కిట్లు అందజేత BJP leaders donate PPE kits to thenali hospital staff in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8197611-870-8197611-1595874553033.jpg)
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తున్న భాజపా నేత