ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 5:27 PM IST

ETV Bharat / state

పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: విష్ణువర్దన్ రెడ్డి

రాష్ట్రంలో పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భాజపా నేత విష్ణువర్దన్​రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఆస్థి పన్ను గురించి మాట్లాడని ప్రభుత్వం.. ఆ తర్వాత పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.

vishnu vardhan reddy
విష్ణువర్దన్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల ముందు ఆస్థి పన్ను గురించి మాట్లాడని ప్రభుత్వం.. ఆ తర్వాత పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత పన్నులు పెంచటం వారిని వంచించటమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే ఆస్థిపన్ను పెంచినట్లు చెప్పటాన్ని తప్పుబట్టారు. ఆస్థి పన్ను రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. వెంటనే పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details