ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి - ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ

పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా... ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి
ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి

By

Published : Aug 1, 2020, 9:34 AM IST

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న రెడ్డిబోయిన యేసుదాసుగా గుర్తించారు. వినుకొండలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి నూజెండ్లకి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...పాల డైరీ ట్యాంకర్ ఢీ కొట్టింది. యేసుదాసును 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details