ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2020, 4:38 PM IST

ETV Bharat / state

'నరసరావుపేటను కరోనా రహితంగా చేద్దాం'

మే 15నాటికి నరసరావుపేటను కరోనా రహిత ప్రాంతంగా మారుద్దామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్​కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.

bcci selction committe former chairman msk prasad comments on narsarao peta
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్​కే ప్రసాద్

నరసరావుపేట ప్రజలందరం కలసి మే 15 నాటికి పట్టణాన్ని కరోనా వైరస్ రహిత ప్రాంతంగా మార్చుకుందామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్​కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో కరోనా వైరస్ అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న మిషన్ మే 15 కార్యక్రమానికి మన వంతుగా సహకారాన్ని అందిద్దామన్నారు. మే 15 నాటికి పట్టణంలో కరోనా వైరస్ జీరోస్థాయికి తెచ్చేవిధంగా కృషి చేద్దామన్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా... ఆన్​లైన్ క్లాసులు ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details