ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతాల్లో బ్యానర్ల ఏర్పాటు

కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలకు ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి బ్యానర్లు ఏర్పాటు చేయాలని... గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు.

By

Published : May 8, 2020, 6:38 PM IST

banners will fix in all redzone areas in guntur dst ordered by muncipal commissioner anuradha
banners will fix in all redzone areas in guntur dst ordered by muncipal commissioner anuradha

గుంటూరు జిల్లాలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో... ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ నోడల్ ఆఫీసర్లను ఆదేశించారు. రెడ్ జోన్ల నుంచి ప్రజల రాకపోకలు నిషేధించాలని, అక్కడి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వే చేయాలని... ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details