ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2021, 9:29 PM IST

ETV Bharat / state

తెనాలిలో ఐదు కిలోల శిశువు జననం

అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2 నుంచి 4 కిలోల బరువు ఉంటారు. అందుకు భిన్నంగా గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో.. రేష్మ అనే మహిళకు 5 కిలోల బరువుతో ఓ బాబు పుట్టాడు. ఇది అరుదైన విషయంగా వైద్యులు చెబుతున్నారు.

five kgs baby born in tenali
తెనాలిలో ఐదు కిలోల శిశువు జననం

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఓ మహిళ 5 కిలోల బరువున్న బాబుకు జన్మనిచ్చింది. నందివెలుగుకు చెందిన రేష్మ అనే మహిళ.. తొలి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. సాధారణ విధానంలో కాన్పు కష్టమని తేల్చిన వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. బాబు బరువు చూడగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తెనాలిలో ఐదు కిలోల శిశువు జననం

సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2 నుంచి 4కిలోల వరకూ ఉంటారు. ఈ బాబు 5 కిలోలు ఉండటం.. అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:మాజీ ఎంపీపీని హత్య చేసి దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details