ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2020, 10:08 PM IST

ETV Bharat / state

గాయపడిన న్యాయవాదికి చంద్రబాబు పరామర్శ

మాచర్ల దాడి ఘటనలో గాయపడిన న్యాయవాది కిశోర్​ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

గాయపడిన న్యాయవాదిని పరామర్శించిన చంద్రబాబు
గాయపడిన న్యాయవాదిని పరామర్శించిన చంద్రబాబు

గాయపడిన న్యాయవాదిని పరామర్శించిన చంద్రబాబు

మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందతున్న న్యాయవాది కిశోర్‌ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయవాదులు కిశోర్​ను పరామర్శించిన వారిలో ఉన్నారు. దాడి వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రజలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. రక్తం ధారగా పడుతున్నా.. విధి నిర్వహణలో వెనక్కు తగ్గకుండా కిశోర్ పోరాడారని ప్రశంసించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details