ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2021, 5:02 PM IST

ETV Bharat / state

గుత్తులపుట్టులో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Auto overturns in Guthulaputtu 10 injured
గుత్తులపుట్టులో ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు పరిధిలో ఆటో బోల్తా పడటంతో.. పది మందికి గాయాలయ్యాయి. మఠం గ్రామంలో మరణించిన బంధువును చూసేందుకు పెదబయలు మండలం పెదకోడాపల్లి నుంచి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుత్తులపుట్టులో.. పశువులను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ఆటోలో ఉండగా.. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్​లలో పాడేరు ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details