ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

ప్రయాణికుడు మరిచిపోయిన 2లక్షల రూపాయల నగదును పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.

By

Published : Jul 26, 2019, 10:01 PM IST

ఆటోడ్రైవర్

ఆటోడ్రైవర్

గుంటూరులో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నాడు. డొంక రోడ్డులో తన ఆటో ఎక్కిన ప్రయాణికుడు అమరావతి రోడ్డులో దిగిపోయాడు. ఆటోలో తన బ్యాగ్ మర్చిపోయాడు. విషయం గుర్తించిన ఆటో డ్రైవర్ డేవిడ్... ఆ బ్యాగ్ తెరచి చూడగా అందులో రెండు లక్షల రూపాయలు ఉన్నాయి. బ్యాగ్​లో నగదుతో.. పాటు ప్రయాణికుడు జూలకంటి రాజేష్ పాస్ పోర్టు ఉంది. డేవిడ్ వెంటనే నల్లపాడు పోలీసు స్టేషన్​కు వెళ్లి నగదుతో ఉన్న సంచిని పోలీసులకు అప్పగించాడు. ఆటో డ్రైవర్ డేవిడ్ నిజాయితీని ఎస్.ఐ సుబ్బారావు మెచ్చుకున్నారు. పాస్ పోర్టు ఆధారంగా రాజేశ్​ను పిలిపించి నగదు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details