బాపట్ల పట్టణం బాలకృష్ణపురం సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. మరణించిన వ్యక్తి నరసాయపాలెం గ్రామానికి చెందిన అంకమ్మరావుగా పోలీసులు గుర్తించారు. ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి - guntur district latest auto news
బాపట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి అంకమ్మరావుగా పోలీసులు గుర్తించారు.

రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో నరసాయపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ మృతి