ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలంలో ఉన్న మహిళ, పురుషుడిపై దాడి.. మహిళ మృతి - attack by unidentified people news

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్త కూచిపూడి గ్రామ శివారు పొలాల్లో ఉన్న మహిళ, పురుషుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళ మృతి చెందగా... పురుషుడి పరిస్థితి విషమంగా ఉంది.

ATTACK
ATTACK

By

Published : Jun 28, 2021, 6:17 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్త కూచిపూడి గ్రామంలోని శివారు పొలాల్లో ఉన్న మహిళ, పురుషుడిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విషయం గమనించిన స్థానికులు... తీవ్ర గాయాలైన పున్నమ్మ(40), బాలయ్య(51)ను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. గుంటూరులో చికిత్స పొందుతూ పున్నమ్మ మృతి చెందింది. బాలయ్య తలకు బలమైన దెబ్బలు తగిలాయని... అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదని బాధితుడి స్నేహితుడు రవికుమార్​ తెలిపాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:పెళ్లి అనగానే పరారైన యువకుడు..

ABOUT THE AUTHOR

...view details