ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరండల్​పేట హత్య కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు రాజీవ్​గాంధీ నగర్​లో ఈనెల 8న జరిగిన హత్య కేసును అరండల్​పేట పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే తన భర్తను హతమార్చినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు. నిందితల నుంచి రెండు చరవాణులు, ఒక ఆటో, రోకలి బండను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

By

Published : Dec 16, 2020, 11:05 PM IST

arandalpeta murder chased by guntur district police
ఆరండల్​పేట హత్య కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు రాజీవ్​గాంధీ నగర్ ఆరో లైన్​లో నివాసముండే మరియదాసుకు... మరియమ్మ అనే మహిళతో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. మరియదాసు మార్బుల్స్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు వేమూరు మండలంలోని పెరవలి గ్రామంలో ఉంటోంది. కూతురును చూసేందుకు మరియమ్మ వారానికి ఒకసారి పెరవలికి వెళ్తోంది. ఈక్రమంలో ఆటో డ్రైవర్ అనిల్ బాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి ఇద్దరి మద్య వివాహేతర సంబంధంగా మారింది.

గొంతుకు తాడు బిగించి, రోకలి బండతో మోది...

వివాహేతర సంబంధం గురించి మరియదాసుకు తెలిసి మరియమ్మను మందలించాడు. దీంతో అక్రమ సంబంధానికి మరియదాసు అడ్డు వస్తున్నాడని, అతని అడ్డు తొలగించుకోవడానికి భార్య మరియమ్మ... ప్రియుడితో కలసి పథకం పన్నారు. ఈనెల 7 అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరియదాసు నిద్రిస్తుండగా.. అనిల్, మరియమ్మ ఇద్దరూ మరియదాసు గొంతుకు తాడు బిగించి, రోకలిబండతో తలపై బలంగా కొట్టి హతమార్చారు.

వాలంటీర్ సమాచారంతో...

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అరండల్​ పేట పోలీసులు.. స్థానిక వార్డు వాలంటీర్ సమాచారం ఆధారంగా విచారించి, అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుప్రజా తెలిపారు.

ఇదీచదవండి.

'పారాసిటమాల్, బ్లీచింగ్ కలిపి టీకా తయారు చేశారా..?'

ABOUT THE AUTHOR

...view details