తెదేపా నేత యరపతినేనిపై దాఖలైన మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం... దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ పేర్కోంది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతి పునరుద్ధరణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టైంది.
సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే! - ap_govt_gave_permit_probe_to_yarapathineni_mining_case
తెదేపా నేత, మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస్పై అక్రమ మైనింగ్ ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహరాన్ని సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
![సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4538714-424-4538714-1569328401538.jpg)
ap_govt_gave_permit_probe_to_yarapathineni_mining_case
సీబీఐ పునరుద్ధరణ తర్వాత.. మెుదటి కేసు యరపతినేనిదే!
Last Updated : Sep 24, 2019, 7:41 PM IST