అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇంఛార్జ్ చందు సాంబశివుడు, అమరావతి రాజకీయేతర ఐకాస నాయకులు మల్లికార్జునరావు, రాయపాటి శైలజ, తెనాలి జేఏసీ సభ్యులు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
'అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి' - రాజధాని అమరావతి తాజా వార్తలు
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ గుంటూరు జిల్లా తెనాలిలో అఖిలపక్ష కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రాజధానుల విషయంలో సీఎం జగన్ నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
!['అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి' Amaravati protests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8840396-569-8840396-1600360554280.jpg)
Amaravati protests
సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని... అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.