ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ను సీఎం చేస్తే.. రాష్ట్రం గతి అధోగతే: వంగవీటి రాధా - విమర్శ

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి తెదేపా నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని రాధా విమర్శించారు.

మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి వంగవీటి ప్రచారం

By

Published : Apr 2, 2019, 4:17 PM IST

మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి వంగవీటి ప్రచారం
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లోమంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి.. తెదేపా నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా... సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా.. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాధా విమర్శించారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details