ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP BJP President Daggubati Purandeswari Press Meet: 'ఇసుక, మద్యం పాలసీతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీ.. సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నం'

AP BJP President Daggubati Purandeswari Press Meet: ఏపీలో ఇసుక, మద్యం పాలసీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీ ద్వారా వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్​కు వెళ్లాయని ఆరోపించారు. నిత్యం అవసరమయ్యే ఇసుకపైనా అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని.. సామాన్యులపై భారం పడిందని అన్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 1:59 PM IST

AP BJP President Daggubati Purandeswari Press Meet
AP BJP President Daggubati Purandeswari Press Meet

AP BJP President Daggubati Purandeswari Press Meet: రాష్ట్రంలో కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని పురందేశ్వరి ఆరోపించారు. ప్రజా సమస్యలని ప్రస్తావించడం తమ ప్రధాన అజెండా అని తెలిపిన పురందేశ్వరి.. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తాను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

AP BJP President Daggubati Purandeswari Press Meet: ఇసుక పాలసీతో.. నిర్మాణ రంగం కుదేలైంది.. నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు: పురందేశ్వరి

గతంలో ట్రాక్టర్ లోడ్‌ ఇసుక 1000 రూపాయలకి లభించేదని.. కానీ ఇప్పుడు 5 నుంచి 6 వేలకు పెరిగిందని స్పష్టం చేశారు. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడి.. ఇబ్బందులు పడుతున్నారన్న పురందేశ్వరి.. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేవాళ్లు దాదాపు 40 లక్షలమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని.. సరైన కూలి పని దొరకక.. వేరే పనిచేయక చాలా ఇబ్బంది పడుతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి.. నిర్మాణ రంగంతో ముడిపడి ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఎవరినీ పోటీకి రానీయకుండా దిల్లీలో ఉండే ఒకేఒక్క గుత్తేదారుడికి అప్పగించారని మండిపడ్డారు. కొత్త పాలసీలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారని.. అనుభవం లేని కంపెనీకి ఇసుక మైనింగ్‌ అప్పగించారని చెప్పారు.

దిల్లీలో ఉండే జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్‌ కంపెనీకి (JP Ventures) ఇంతకుముందు మైనింగ్‌లో అనుభవం లేదని తెలిపారు. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఎంవోయూలో ఉందని.. కానీ దాన్ని సైతం ఉల్లంఘించారని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్​కీ ఎంటర్ ప్రైజెస్​కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చిందని.. సబ్ లీజ్ తీసుకున్న టర్న్​కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచులను అమ్మేశారని విమర్శించారు.

BJP Purandeswari Demand Forensic Audit in AP Finance Dept ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కేంద్రమంత్రికి విన్నపించిన పురందేశ్వరి

ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్​కు 2 వేల కోట్లు వెళ్లాయని.. హైదరాబాదులోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్న పురందేశ్వరి.. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు.

బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందని.. పెద్దపెద్ద యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి.. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదని కానీ.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారని.. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిధిని మించి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP State President Purandeswari on AP Liquor: ఏపీలో ఏరులై పారుతోన్న మద్యం.. విచారణ జరిపించాలని అమిత్​షాకు పురందేశ్వరి విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details