గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిన్న కారు-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈపూరికి చెందిన పూర్ణచంద్రరావు కరోనాతో గుంటూరులో మృతి చెందారు. ఈ క్రమంలో అతని మృతదేహాన్ని అంబులెన్స్లో స్వస్థలానికి తరలింస్తుండగా.. గుంటూరు వైపుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లోని కోటేశ్వరరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడగా.. ఈరోజూ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడు గుంటూరుకు చెందిన మహాలక్ష్మయ్య అని చెప్పారు.
ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి - Firangipuram Road accident latest information
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కారు-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందగా.. నేడు కారులోని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
![ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి Firangipuram Road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:50:13:1622355613-ap-gnt-32-30-road-accdient-two-ded-av-ap10197-30052021095524-3005f-1622348724-705.jpg)
ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం