ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు ఎద్దు మృతి... ఇద్దరికి గాయాలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఓ రైతు మిర్చిపొలంలో నాగలితో దున్నుతున్నారు. ఉరుములతో కూడిన జల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా పిడుగు... అరకకు కట్టిన ఎద్దుపై పడింది. అది అక్కడిక్కడే మృతిచెందింది. రైతుకు, పొలం యజమానికి గాయాలయ్యాయి. కళ్ల ముందే ఎద్దు మృత్యువాత పడటంతో రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది.

animal died
పిడుగుపాటుకు ఎద్దు మృతి

By

Published : Nov 5, 2020, 8:52 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల పరిధిలోని మిర్చిపొలంలో పిడుగు పడి ఒక ఎద్దు మృతి చెందింది. బాజీ తన పొలాన్ని దున్నాలని లోకేశ్ అనే రైతును కోరారు. ఎద్దులతో రైతు పొలాన్ని దున్నుతుండగా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి.

అంతలో హఠాత్తుగా పిడుగు పడింది. దాంతో ఒక ఎద్దు అక్కడిక్కడే మరణించింది. రైతు, పొలం యజమాని స్పృహా కోల్పోయారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎద్దు మృతిచెందటంతో రైతు లోకేష్ రోదన.. చూపరులను కంటతడి పెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details