ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయం చేయమంటే సంకెళ్లు వేశారు'.. రాజధాని మహిళల వినూత్న నిరసన

మూడు రాజధానులకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చేతులకు సంకెళ్లు కట్టుకుని ధర్నా చేశారు. తమపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Aug 10, 2020, 3:46 PM IST

Updated : Aug 10, 2020, 3:53 PM IST

Amravati women protest with shackles
సంకెళ్లతో అమరావతి మహిళల నిరసన

సంకెళ్లతో రాజధాని మహిళల నిరసన

రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెం వద్ద మహిళలు వినూత్నంగా సంకెళ్లతో చేతులు కట్టుకొని నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న తమకు ప్రభుత్వం సంకెళ్లు విధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని వాపోయారు.

ప్రశ్నిస్తే కేసులు, కొట్టడం, చంపడాలు ఇవే రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నాయని రాజధాని మహిళలు ఆరోపించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.

Last Updated : Aug 10, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details