రాజధాని ఉద్యమం 200వ రోజులో భాగంగా అమరావతి ఐకాస నిర్వహించిన వర్చువల్ నిరసన కార్యక్రమంలో మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల హృదయాల్లో నియంతలా మారారని శైలజ అనే మహిళా రైతు మండిపడ్డారు. ప్రధాని తమకు భరోసా ఇవ్వాలని వెలగపూడి మహిళా రైతులు డిమాండ్ చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చి ఇంత ఇబ్బందులు పడతామని తాము ఎప్పుడూ అనుకోలేదని రాయపూడి మహిళా రైతు షేక్ మాలంబీ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అమరావతి రైతులను హీనంగా చూస్తున్నారని నేలపాడుకు రైతులు నాగలక్ష్మి, పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం అందిస్తానన్న జగన్ రౌడీ పాలన కొనసాగిస్తున్నారని మహిళా ఐకాస నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు.
ప్రధాని మాకు భరోసా ఇవ్వాలి: అమరావతి మహిళలు - అమరావతి మహిళా రైతుల ఆందోళనలు తాజా వార్తలు
అమరావతి ఐకాస నిర్వహించిన వర్చువల్ నిరసన కార్యక్రమంలో మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు. రాజధాని ఉద్యమం 200వ రోజులో భాగంగా జగన్ ప్రభుత్వంపై మహిళా రైతులు పలు విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిచ్చిన తమపై రాజకీయాలు చేయొద్దంటూ... ఆవేదన వ్యక్తం చేశారు.
![ప్రధాని మాకు భరోసా ఇవ్వాలి: అమరావతి మహిళలు amaravathi women farmers virtual protest for capital in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7891017-385-7891017-1593865492547.jpg)
ప్రధాని మాకు భరోసా ఇవ్వాలి: అమరావతి మహిళలు
ప్రధాని మాకు భరోసా ఇవ్వాలి: అమరావతి మహిళలు