ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 7:46 PM IST

ETV Bharat / state

అమరావతే రాజధానిగా ఉండాలంటూ దుర్గామాతకు మహిళల పూజలు

అమరావతి రైతులు 308వ రోజు ఆందోళనలు కొనసాగించారు. దీక్షా శిబిరాల్లో ఉన్న అమ్మవారి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని వేడుకున్నారు.

amaravathi farmers protest
అమరావతే రాజధానిగా ఉండాలంటూ దుర్గా మాతకు మహిళల పూజలు

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి రైతులు 308వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, వెంకటపాలెం, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఐనవోలు, అనంతవరం, నీరుకొండ, ఎర్రబాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద ఆందోళన నిర్వహించారు.

దొండపాడు, అబ్బరాజుపాలెం దీక్షా శిబిరాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రతిమను అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలని జగజ్జననిని వేడుకున్నారు. మందడం దీక్షా శిబిరంలో ఉన్న అమ్మవారిని డబ్బులతో అలంకరించారు.

ABOUT THE AUTHOR

...view details